ఎర్రవల్లిని మండలంగా ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2022-08-07T05:06:50+05:30 IST

జోగు ళాంబ గద్వాలజిల్లా ఇటిక్యాల మండలంలోని ఎర్రవల్లి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని ఎ మ్మెల్యే అబ్రహాం కోరా రు.

ఎర్రవల్లిని మండలంగా ఏర్పాటు చేయాలి
సీఎస్‌కు వినతి పత్రాన్ని అందిస్తున్న ఎమ్మెల్యే అబ్రహాం

 ఎర్రవల్లి చౌరస్తా, ఆగస్టు 6: జోగు ళాంబ గద్వాలజిల్లా ఇటిక్యాల మండలంలోని ఎర్రవల్లి   గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని ఎ మ్మెల్యే అబ్రహాం కోరా రు. ఈ మేరకు శనివా రం హైదరాబాద్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండలంగా ఏర్పాటుకు రావా ల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరారు. కాగా,  ఎర్రవల్లి మండలంగా ఏర్పాటు చేయాలని  స్థానికులు చేపట్టిన దీక్ష తొమ్మిదో రోజుకు చేరిం ది. బి.వీరాపురం గ్రామస్థులు, సర్పంచ్‌ రాముడు ఆధ్వర్యంలో దీక్షలు కూర్చున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు దీక్ష కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో ఎర్రవల్లి సర్పంచ్‌ రవి, సాధన సమితి నాయకులు రాగన్న, కృష్ణసాగర్‌, గుమ్మగోవర్ధన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-07T05:06:50+05:30 IST