కాలువల్లో పూడిక తీయాలి
ABN , First Publish Date - 2022-06-27T04:31:17+05:30 IST
జూరాల, భీమా, చెరువులు పంట కాలువల్లో పూడిక తీయాలని జడ్పీటీసీ సభ్యుడు రాజేంద్రప్రసాద్ అధికారులను కోరారు.
- జడ్పీటీసీ సభ్యుడు రాజేంద్రప్రసాద్
శ్రీరంగాపురం, జూన్ 26: జూరాల, భీమా, చెరువులు పంట కాలువల్లో పూడిక తీయాలని జడ్పీటీసీ సభ్యుడు రాజేంద్రప్రసాద్ అధికారులను కోరారు. ఆదివా రం ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న జూరాల కాలువ కు గండ్లు పడినా, లైనింగ్ పోయినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. భీమా కాలువ డిస్ర్టిబ్యూటర్ల పనులు పూర్తి కాలేదని, దీంతో పంట పొలాలకు సాగునీరు అందడం లేదన్నారు. అధికారులు ముందస్తుగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపి వేసవిలో పనులు పూర్తిచేయాల్సి ఉండగా ఇంత వరకు పట్టించుకోలేదన్నారు. దీంతోపాటు రంగసముద్రం రిజర్వాయర్ ఆయకట్టు కింద ఎర్ర కాలువ, జాలు కాలువ, తిమ్మక్క కాల్వ, నక్కల కాలువ, పరకొని కాలువ, కంచిలోని కాలువలలో పూడిక తీయడం లేదని వాపోయా రు. ఉపాధి హామీ పథకం కింద పనులు చేయాలని డిమాండ్ చేశారు. మండలంలోని తాటిపాముల, వెంకటాపూర్ తదితర గ్రామాల కుంటల కింద కాలువల్లో పూడిక తీయాలని ఆయన కోరారు.