పోలీసుల అదుపులో నిందితులు
ABN , First Publish Date - 2022-03-18T05:48:57+05:30 IST
కృష్ణ మండల కేంద్రంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు మునాఫ్ను హత్య చేసిన కేసులో నిందితులను అదు పులోకి తీసుకున్నట్లు సీఐ సీతయ్య తెలి పారు.
మక్తల్ రూరల్, మార్చి 17 : కృష్ణ మండల కేంద్రంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు మునాఫ్ను హత్య చేసిన కేసులో నిందితులను అదు పులోకి తీసుకున్నట్లు సీఐ సీతయ్య తెలి పారు. గురువారం మక్తల్ సర్కిల్ ఆఫీ స్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారితో పాటు వాడిన ఆయుధాలను సైతం ప్రదర్శించారు. నిందితులు యశ్వంత్కుమార్ అలియాస్ చౌదరి, దేవరాజ్ హత్య గావించ బడిన మునాఫ్ తమను ఇబ్బందుల పాలు చేయడంతో పాటు ఆర్థికంగా దెబ్బతీశాడని, అందుకే హత్యచేసి ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తెలిందని సీఐ తెలిపారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. కృష్ణ ఎస్ఐ విజయ్కుమార్ పాల్గొన్నారు.