సోమశిల నుంచి హైదరాబాద్కు బస్సు ప్రారంభం
ABN , First Publish Date - 2022-11-03T23:44:52+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలోనే ఆ ధ్యాత్మికంగా, పర్యాటక రంగంలో విరాజిల్లుతున్న సోమ శిల గ్రామం నుంచి వయా కొల్లాపూర్ మీదుగా హైదరా బాద్కు ఆర్టీసీ బస్సు సేవలు గురువారం ప్రారంభ మయ్యాయి.
కొల్లాపూర్, నవంబరు 3 : తెలంగాణ రాష్ట్రంలోనే ఆ ధ్యాత్మికంగా, పర్యాటక రంగంలో విరాజిల్లుతున్న సోమ శిల గ్రామం నుంచి వయా కొల్లాపూర్ మీదుగా హైదరా బాద్కు ఆర్టీసీ బస్సు సేవలు గురువారం ప్రారంభ మయ్యాయి. గత కొన్ని రోజుల నుంచి గ్రామ సర్పంచ్ బృంగి మద్దిలేటి, మాజీ సర్పంచ్ కేతూరి వెంకటస్వా మి, రంగస్వామి, మాజీ ఉప సర్పంచ్ రవీందర్, కొల్లాపూర్ మండల కో ఆప్షన్ సభ్యులు హరూన్పాషలు తమ గ్రామం మీదుగా ఆర్టీసీ బస్సును హైదరాబాద్కు నడపాలని పలుమార్లు డిపో మేనేజర్ పి.రాజేశ్వర్ దృ ష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ఆదేశా ల మేరకు గురువారం నుంచి సోమశిల గ్రామ ప్రజలు, పర్యాటకుల సౌకర్యార్థం ఉదయం 8గంటలకు కొల్లాపూ ర్ నుంచి ఎక్స్ప్రెస్ బయల్దేరి 8:20గంటలకు సోమశిల గ్రామానికి చేరుకుని 8:30గంటలకు సోమశిల నుంచి హైదరాబాద్కు బ యల్దేరుతుంది. మధ్యాహ్నం 12:10 గంటలకు హైదరాబాద్ నుంచి బ యల్దేరి 4:10గంటలకు కొల్లాపూర్కు చేరుకొని అక్కడి నుంచి 4:45గంటల కు కొల్లాపూర్ నుంచి బయల్దేరి సా యంత్రం 5గంటలకు సోమశిలకు చేరుతుందని డిపో మేనేజర్ పి.రాజే శ్వర్ పేర్కొన్నారు. అంతకు ముందు లలితాంబిక సోమేశ్వరాలయంలో నూతనంగా ప్రారంభమవుతున్న బ స్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మద్దిలేటి, మాజీ సర్పంచ్కేతూరి వెంకటస్వామి, కొల్లాపూర్ సీఆర్పీ రామయ్య, సెఫ్టీవార్డెన్ నజీమ్ తదితరులు పాల్గొన్నారు.