జిల్లా రెడ్క్రాస్కు అవార్డులు
ABN , First Publish Date - 2022-06-30T04:57:47+05:30 IST
ఈనెల 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సం దర్భంగా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో పలువురు రక్తదానం చేశారు.
- అభినందించిన కలెక్టర్ హరిచందన
నారాయణపేట, జూన్ 29 : ఈనెల 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సం దర్భంగా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో పలువురు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారు రాష్ట్ర ఇండియన్ రెడ్క్రాస్ అధ్యక్షురాలు, గవర్నర్ తమి ళసై సౌందర రాజన్చే అవార్డులు పొందగా బుధవారం కలెక్టర్ హరిచందన గవ ర్నర్చే జారీ చేయబడ్డ ప్రశంసాపత్రాలను రక్తదాతలకు అందించి సత్కరించారు. అవార్డులు, ప్రశంసాపత్రాలు పొందిన వారిలో ఎనిమిదేళ్లుగా 29 సార్లు రక్తదా నం చేసిన నారాయణపేటకు చెందిన యూసుఫ్ తాజ్, 37 సార్లు రక్తదానం చేసిన అశోక్ టీచర్, రక్తదానం చేసిన సంస్థలు చిటె ్టం నర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరపున ప్రిన్సిపాల్ మెర్సీ వసంత, వివేకానంద సేవా సంస్థ సభ్యులు ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా రెడ్క్రాస్ చైర్మన్ సుదర్శన్రెడ్డి, వైస్ చైర్మన్ సరాఫ్ నాగరాజ్, ఆత్మరాం, జయంత్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.