కోర్టు కాంప్లెక్స్ కోసం స్థలం కేటాయించండి
ABN , First Publish Date - 2022-08-12T05:07:05+05:30 IST
అధునా తన కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని ము ఖ్యమంత్రి కేసీఆర్ను మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ కోరారు.
- సీఎం కేసీఆర్కు విన్నవించిన మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్గనగర్, ఆగస్టు 11 : అధునా తన కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని ము ఖ్యమంత్రి కేసీఆర్ను మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ కోరారు. ప్రగతి భవన్లో కేబినెట్ స మావేశం అనంతరం మంత్రి కేసీఆర్ను కలి శారు. పాలమూరు సమీపంలోని బండమీదిపల్లి దగ్గర పాడి పరిశ్రమాభివృద్ధికి చెందిన 15 ఎకరాల స్థలాన్ని కోర్టు భవనం కోసం కేటాయించాలని గురువారం ప్రగతిభవన్లో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి వినతిపత్రం అందజేశారు. అధునాతన కోర్టు భవన నిర్మాణం కోసం నిఽధులు కూడా మంజూరు చేయాలని కోరారు.