శ్రీ పరసవేదీశ్వరస్వామి ఆలయంలో సినీనటుడు తనికెళ్ల భరణి పూజలు
ABN , First Publish Date - 2022-12-09T23:59:20+05:30 IST
జడ్చర్ల మండలం కుర్వగడ్డపల్లి సమీపంలోని దుందుబీనది పరివాహక ప్రాంతంతో ఉన్న శ్రీపరసవేదీశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారికి ప్రము ఖ సినీనటుడు తనికెళ్ల భరణి ప్రత్యేక పూజలు చేశారు.
జడ్చర్ల, డిసెంబరు 9 : జడ్చర్ల మండలం కుర్వగడ్డపల్లి సమీపంలోని దుందుబీనది పరివాహక ప్రాంతంతో ఉన్న శ్రీపరసవేదీశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారికి ప్రము ఖ సినీనటుడు తనికెళ్ల భరణి ప్రత్యేక పూజలు చేశారు. శివుడికి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ చరిత్రతో పాటు బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం తో పాటు ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు. ఆలయానికి వచ్చిన భరణిని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గోపాల్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో శివ, నాగి రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, యాదయ్య, రవీందర్రెడ్డి, పర్వతాలు, యాదయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.