మురుగు గుంతలో పడి బాలుడి మృతి
ABN , First Publish Date - 2022-08-19T05:42:20+05:30 IST
మురుగు గుంతలో పడి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు.
మద్దూర్, ఆగస్టు 18 : మురుగు గుంతలో పడి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మం డలంలోని నిడ్జింతలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. ఎక్కమేడ్ గ్రామానికి చెందిన కాశమ్మ తన కుమారుడు విష్ణు(3)తో కలిసి ఇటీవల నిడ్జింతలోని పుట్టింటికి వచ్చింది. పూడుకపో యిన బావిలో సమీప ఇళ్లవారు మురుగునీరు వదు లుతుండటంతో కందకంగా(ఊబి) మారింది. ఈ క్ర మంలో బాలుడు ఆడుకుంటూ వెళ్లిన మురుగుగుంతలో పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు వెలికితీసి మద్దూర్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. గతంలో కూడా మురుగుగుంటలో పడి ఓ వృద్ధుడు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. పల్లెప్రగతిలో బావి గుంతను పూడ్చకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని గ్రామస్థులు ఆరోపిం చారు. అధికారుల నిర్లక్ష్యంతనే బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.