కనకగిరి అడువుల్లో పెరిగిన వన్యప్రాణులు

ABN , First Publish Date - 2022-12-07T00:03:28+05:30 IST

జిల్లాలోనే పేరున్న కనకగిరి అడవులు వన్యప్రాణాలకు ఆవాసంగా మారింది. అడవి దట్టంగా ఉండటంతో వీటిసంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. చిరుతపులి సంచారం నేపథ్యంలో గత కొద్దిరోజుల నుంచి తల్లాడ అటవీశాఖ అధికారులు అడవుల్లో పర్యటించిన సందర్భంగా రకరకాల వన్యప్రాణులు వారి కంట పడ్డాయి.

కనకగిరి అడువుల్లో పెరిగిన వన్యప్రాణులు
సీసీ కెమెరాకు చిక్కిన వన్యప్రాణులు

ఏన్కూరు, డిసెంబరు6: జిల్లాలోనే పేరున్న కనకగిరి అడవులు వన్యప్రాణాలకు ఆవాసంగా మారింది. అడవి దట్టంగా ఉండటంతో వీటిసంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. చిరుతపులి సంచారం నేపథ్యంలో గత కొద్దిరోజుల నుంచి తల్లాడ అటవీశాఖ అధికారులు అడవుల్లో పర్యటించిన సందర్భంగా రకరకాల వన్యప్రాణులు వారి కంట పడ్డాయి. ఇప్పటి వరకు అధికారులకు నాచారం, మేడేపల్లి అడవుల్లో పాదముద్రలు లభించాయి. చిరుత ఎక్కడెక్కడ తిరుగుతుందని విషయంపై అటవీశాఖ అధికారులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. చిరుత పాదముద్రలతో పాటు వీరికి ఎలుగుబంటి పాదముద్రల కూడా లభించాయి. ఎగులుబంట్లు సంఖ్య కూడా ఈప్రాంతలో పెరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. అడవిదున్నల్లు, మనుబోతులు, కనజులు, జింకలు, కొండగొర్రెలు, జింకలసంతతికూడా పెరగడతో చిరుత కనకగిరి రిజర్వు ఫారెస్టులో నే తిష్టవేసినట్టు భావిస్తున్నారు. గతరెండు, మూడేళ్లనుంచి దట్టమైన అడవి పెరగడంతో వన్య ప్రాణులకు ఇక్కడ అనుకూల వాతావరణం ఏర్పడింది. కనకగిరి రిజర్వుఫారెస్టు తల్లాడ, కల్లూరు, చండ్రుగొండ, ఏన్కూరు మండలాల పరిధిలో సుమారు 60వేల ఎకరాల్లో విస్తరించి ఉంది.

Updated Date - 2022-12-07T00:04:00+05:30 IST