శ్రీనివాసరావు కుటుంబానికి అండగా ఉంటాం

ABN , First Publish Date - 2022-12-05T00:50:05+05:30 IST

ఇటీవల గొత్తికోయల దాడిలో మృతిచెందిన ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ చల్లమల్ల శ్రీనివాసరావు కుటుంబానికి అండగా ఉంటామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

శ్రీనివాసరావు కుటుంబానికి అండగా ఉంటాం
శ్రీనివాసరావు కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న మాజీమంత్రి తుమ్మల

మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం ఖానాపురంహవేలి, డిసెంబరు 4: ఇటీవల గొత్తికోయల దాడిలో మృతిచెందిన ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ చల్లమల్ల శ్రీనివాసరావు కుటుంబానికి అండగా ఉంటామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రఘునాథపాలెం మండలం ఈర్లపుడి గ్రామంలోని శ్రీనివాసరావు నివాసానికి వెళ్లిన తుమ్మల శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ పోడుభూములు పరిరక్షణలో శ్రీనివాసరావు చేసిన కృషి మరువలేనిదని, ఆయన ఆశయాలను కొనసాగించేందుకు కుటుంబసభ్యులు కృషిచేయాలన్నారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ నాయకులు గుత్తా వెంకటేశ్వర్లు, తాతా రఘురాం, తుపాకుల యలగొండస్వామి, సుడా సభ్యులు ఖాదర్‌బాబు, పంతులునాయక్‌, గుర్రం జగన, సురేష్‌ తదితరులున్నారు.

Updated Date - 2022-12-05T00:50:17+05:30 IST