ఖమ్మం కలెక్టర్కు కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2022-08-12T06:01:20+05:30 IST
ఖమ్మం కలెక్టర్కు కరోనా పాజిటివ్
హోం ఐసోలేషనలో వైద్యసేవలు
ఖమ్మం కలెక్టరేట్, ఆగస్టు 11: ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్కు కరోనా పాజిటివ్ నిర్ధారణైంది. ఆయనకు దగ్గు, జలుబు రావడంతో ఇంటివద్దనే విశ్రాంతి తీసుకుంటున్నా రు. మంగళవారం రాత్రి ఆయన జిల్లా ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు ఏవో రాజశేఖర్, డాక్టర్ రాంప్రసాద్, పాథాలజిస్ట్ డాక్టర్ బాలు కలెక్టర్ను పరీక్షించారు. ఆ తర్వాత కలెక్టర్ రక్తనమూనాలు సేకరించారు. దాంతో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు కూడా చేశారు. మంగళవారం తీసుకున్న ఆర్టీపీసీఆర్ శాంపిల్స్కు సంబంధించిన నివేదిక బుధవారం వచ్చినట్లు తెలిసింది. అందులో కలెక్టర్కు 32శాతం కరోనా పాజిటివ్ లక్షణాలు అంటే మైల్డ్గా ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు కలెక్టర్ గౌతమ్ ఇంటివద్దనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కలెక్టర్కు నెబ్లైజర్తో జలుబును తగ్గించేందుకు చికిత్స చేస్తున్నట్లు తెలిపారు. రెండురోజుల్లో కోలుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వైద్యులు తెలిపారు.
భద్రాద్రి జిల్లాలో ఎనిమిది మందికి కొవిడ్
భద్రాద్రి జిల్లాలో గురువారం ఎనిమిది కరోనా కేసులు నమోదయ్యాయి.మొత్తం 184 మందికి పరీక్షలు నిర్వహిచగా ఎనిమిది మందికి పాజిటివ్ నమోదైంది.