అతివేగం అనర్థాలకు మూలం
ABN , First Publish Date - 2022-11-24T00:04:36+05:30 IST
రోడ్డు ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి. శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసరావు
రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు
ఖమ్మం లీగల్, నవంబరు 23: రోడ్డు ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి. శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలు, కారణాలపై న్యాయమూర్తి బుధవారం న్యాయసేవాసదన్లో అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతి గంటకు 18 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వివరిస్తూ అతివేగం, నిర్లక్ష్యం, జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లనే ఎ క్కువగా జరుగుతున్నాయన్నారు. ద్విచక్రవాహన దారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. మనసు ఆందోళన తో ఉన్నప్పుడు వాహనం నడపవద్దని, అది ప్రమాదాలకు దారితీయవచ్చన్నారు. వాహన యజమాని తప్పనిసరిగా వాహనానికి బీమా చేయించాలని, డబ్బులు మిగులుతా యని భావించి బీమాను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆసుపత్రికి తరలించేందు కు వెనకాడవద్దని, అటువంటి సమాజహితం కల వ్యక్తిని చట్టం గౌరవిస్తుందేకాని ఇబ్బందుల పాలు చేయదని వివ రించారు. వాహనానికి తగిన బీమా లేక రోడ్డు ప్రమాదానికి కారణమైన ఒక కేసులో వాహన యజమాని రూ.24 లక్షలు చెల్లించిన విషయాన్ని న్యాయమూర్తి ఈ సందర్బంగా వివరించారు. న్యాయసేవాసంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్జడ్జి మహ్మద్ అబ్దుల్జావీద్పాషా, ప్రాంతీయ రవాణా అధికారి కిషన్రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి రోడ్డు ప్రమాదా లపై రూపొందించిన వాల్పోస్టర్ ఆవిష్కరించారు.