పరశురాముడిగా భద్రాద్రి రామయ్య

ABN , First Publish Date - 2022-01-09T06:48:37+05:30 IST

పరశురాముడిగా భద్రాద్రి రామయ్య

పరశురాముడిగా భద్రాద్రి రామయ్య

నేడు శ్రీరామావతారంలో స్వామివారు

భద్రాచలం/ దుమ్ముగూడెం జనవరి 8: భద్రాద్రి జిల్లా భద్రాచలంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా శనివారం సీతారామచంద్రస్వామి వారు పరశురామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సమయంలో భక్తులు స్వామివారిని దర్శించి తరించారు. అంతకు ముందు సీతారామచంద్రస్వామి వారిని ఆలయంలో పరశురామావతారంలో అందంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నిత్య కల్యాణమండపానికి తీసుకొచ్చారు. ఈ సమయంలో స్వామివారికి విశ్వక్సేన పూజా, పుణ్యహావచనం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాగా వేదపండితులు స్వామి వారికి వేద విన్నపాలను సమర్పించగా అనంతరం నాళాయర దివ్య ప్రబంధం, వేద పారాయణం పఠించారు.అనంతరం స్వామి వారికి నివేదన చేశారు. అనంతరం భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో బి.శివాజీ, ఏఈవో వి.శ్రవణ్‌కుమార్‌, పర్యవేక్షకులు కత్తి శ్రీనివాస్‌, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతా రామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్‌, సంస్మృత పండితులు ఎస్టీజీ శ్రీమన్నారాయణాచార్యులు, విశ్రాంత ప్రధాన అర్చకులు పొడిచేటి రామచం ద్రాచార్యులు పరిపాలన, వైదిక సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఆదివారం స్వామివారు శ్రీరామావతారంలో భక్తులకు దర్శనమిస్తారు.

వరాహవతారంలో దర్శనమిచ్చిన రామయ్య

ముక్కోటి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల రామయ్య శనివారం పరశురామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ అవతారాన్ని దర్శించడం వల్ల శుక్రగ్రహ బాధలనుంచి విముక్తి పొందుతామని భక్తులు విశ్వసిస్తారు. కార్యక్రమంలో అర్చకులు కిరణ్‌కుమారా చార్యులు, భార్గవాచార్యులు, నర్సింహాచార్యులు, వెంకటాచార్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-09T06:48:37+05:30 IST