రుణాలు చెల్లించలేదని ఇళ్లకు తాళాలు
ABN , First Publish Date - 2022-01-21T05:32:18+05:30 IST
తీసుకున్న రుణాలు చెల్లించడం లేదని ఓ ఆరుగురు రైతుల ఇళ్లకు తాళాలు వేసిన సంఘటన కామేపల్లి మండలం గరిడేపల్లి గ్రామంలో గురువారం జరిగింది.
కామేపల్లి మండలం గరిడేపల్లి గ్రామంలో ఘటన
కామేపల్లి, జనవరి20: తీసుకున్న రుణాలు చెల్లించడం లేదని ఓ ఆరుగురు రైతుల ఇళ్లకు తాళాలు వేసిన సంఘటన కామేపల్లి మండలం గరిడేపల్లి గ్రామంలో గురువారం జరిగింది. గరిడేపల్ల్లి గ్రామానికి చెందిన కొందరు రెండు, మూడు ఏళ్ల కితం డీసీసీ బ్యాంక్లో జేఎల్జీ గ్రూప్ ద్వారా రూ.10వేల చొప్పున రుణాలు తీసుకున్నారు. తీసుకున్న రుణాలు ఇంతవరకు చెల్లించకపోవడంతో అట్టి రుణాలు చెల్లించమని డీసీసీ అధికారులు పలుమార్లు నోటసులు జారీ చేశారు. తీసుకున్న రుణం కట్టని వారి ఇళ్లకు డీసీసీ అధికారులు సీజ్ చేసి తాళాలు వేశారు. గ్రామంలో చందావత్ శ్రీను, మరో ఆరుగురి ఇండ్లకు సీజ్ చేసి తాళాలు వేశారు.