కేటీపీఎస్‌ ఏడోదశలో విద్యుత ఉత్పత్తి పునరుద్ధరణ

ABN , First Publish Date - 2022-01-23T04:47:08+05:30 IST

పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌) ఏడోదశలో అధికారులు శనివారం విద్యుత ఉత్పత్తిని పునరుద్ధరించారు. 800 మెగావాట్ల విద్యుత ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన ఈ యూనిట్‌లో 10 రోజుల పాటు మరమ్మతులు నిర్వహించారు. టర్బైన్‌లో తీవ్రమైన ప్రకంపనలు

కేటీపీఎస్‌ ఏడోదశలో విద్యుత ఉత్పత్తి పునరుద్ధరణ

పాల్వంచ, జనవరి22: పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌) ఏడోదశలో అధికారులు శనివారం విద్యుత ఉత్పత్తిని పునరుద్ధరించారు. 800 మెగావాట్ల విద్యుత ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన ఈ యూనిట్‌లో 10 రోజుల పాటు మరమ్మతులు నిర్వహించారు. టర్బైన్‌లో తీవ్రమైన ప్రకంపనలు వస్తుండటంతో జెన్కో ఉన్నతాధికారుల ఆదేశంతో హరిద్వార్‌కు చెందిన బీహెచ్‌ఈఎల్‌ నిపుణులు వచ్చి ఏడోదశ నిర్మాణం సమయంలో తీసుకొచ్చి సిద్ధంగా ఉంచిన బేరింగ్‌ను మార్చి మరమ్మతులు పూర్తి చేశారు. దీంతో యూనిట్‌ నుంచి విద్యుత ఉత్పత్తిని గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. కేటీపీఎస్‌ ఏడోదశ చీఫ్‌ ఇంజనీర్‌ పలుకుర్తి వెంకటేశ్వరరావు నేతృత్వంలో పనులు నిర్వహించారు.


Updated Date - 2022-01-23T04:47:08+05:30 IST