రెండు గ్రామాల్లో జప్తులు
ABN , First Publish Date - 2022-01-22T04:28:06+05:30 IST
జేఎల్జీ, ముద్ర రుణాలు చెల్లించాలని లబ్ధిదారుల ఆస్తులను శుక్రవారం డీసీసీబీ అధికారులలు జప్తు చేశారు.
తల్లాడ, జనవరి 21: జేఎల్జీ, ముద్ర రుణాలు చెల్లించాలని లబ్ధిదారుల ఆస్తులను శుక్రవారం డీసీసీబీ అధికారులలు జప్తు చేశారు. మండలంలోని ముద్దునూరు, కలకోడిమ గ్రామాలలో గతంలో జేఎల్జీ, ముద్ర రుణాలు తీసుకోని సకాలంలో చెల్లించాలని మూడు సార్లు బ్యాంకు అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ ఖతారు చేయకుండా రుణాలు చెల్లించడంలో నిర్లక్ష్యం వ్యవహరించిన సుమారు 30 మంది లబ్ధిదారుల ఇళ్లలోని ఆస్తులను డీసీసీబీ అధికారులు జప్తు చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ మేనేజర్ సత్యకీర్తి, స్వప్ప, సూపర్వైజర్లు నాగరాజు, ఓంప్రకాష్ పాల్గొన్నారు.