రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీదే అధికారం

ABN , First Publish Date - 2022-12-05T00:19:44+05:30 IST

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్య ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఏన్కూరులో ఉప్పెర్ల ఆనందప్రసాద్‌ గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాలు గెలుపొందడం ఖాయమన్నారు.

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీదే అధికారం

భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్య ధీమా

ఏన్కూరు, డిసెంబరు4: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్య ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఏన్కూరులో ఉప్పెర్ల ఆనందప్రసాద్‌ గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాలు గెలుపొందడం ఖాయమన్నారు. కేసీఆర్‌ రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ పోడు రైతులకు పట్టాలిస్తానని 8ఏళ్ల కాలం వెళ్లదీసి, మళ్లీ ఎన్నికల కోసమే పట్టాలిస్తానని నాటకం ఆడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ, గృహ నిర్మాణానికి రూ.5లక్షల ఇస్తామన్నారు. ఈసమావేశంలో టీపీసీసీ సభ్యులు మాళోతు రాందాస్‌నాయక్‌, నల్లపు దుర్గాప్రసాద్‌, సోషల్‌మీడియా స్టేట్‌ కన్వీనర్‌ రామ్‌ లక్ష్మణరావు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు జార బిక్షమయ్య, గూడపాటి సతీష్‌, ఉప్పెర్ల ఆనందప్రసాద్‌, సాయిరోహిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-05T00:19:50+05:30 IST