బీటీపీఎస్ మూడు యూనిట్లలో నిలిచిన విద్యుత ఉత్పత్తి?
ABN , First Publish Date - 2022-05-21T06:08:21+05:30 IST
బీటీపీఎస్ మూడు యూనిట్లలో నిలిచిన విద్యుత ఉత్పత్తి?
యూనిట్-1, 2లో బొగ్గు కొరత, ట్యూబ్ లీక్తో ఆగిన మూడో యూనిట్
మణుగూరుటౌన, మే 20: మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషనలో మూడు యూనిట్లలో విద్యుత ఉత్పత్తి నిలిచిపోయినట్టు తెలుస్తోంది. 1,2 యూనిట్లలో బొగ్గుసమస్య తలెత్తిందని,బంకర్ ద్వారా యూనిట్ల మేర బొగ్గును సక్రమంగా అందించలేక పోతున్నారని సమాచారం. దీంతో 270 మెగా వాట్ల సామార్థ్యానికి 200 మెగా వాట్ల వరకు విద్యుత ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిసింది. ఇక బాయిలర్ ట్యూబ్ లీక్ అవడంతో మూడు రోజుల క్రితమే యూనిట్-3లో ఉత్పత్తిని నిలిపివేసినట్టు తెలియగా.. స్పష్టత, మరింత సమాచారం కోసం బీటీపీఎస్ సీఈ బిచ్చన్నను ఫోనలో సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.