TS News: బుల్డోజర్లతో పంటలను ధ్వంసం చేసిన అధికారులు
ABN , First Publish Date - 2022-08-17T19:42:47+05:30 IST
భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem): జిల్లాలో మరోసారి పోడు పోరు ఉద్రిక్తంగా మారింది.
భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem): జిల్లాలో మరోసారి పోడు పోరు ఉద్రిక్తంగా మారింది. కరకగూడెం మండలం, రేగళ్ల పంచాయతీలోని మర్రి మొదలు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోడు సాగుదార్లకు, అటవీశాఖ అధికారులకు ఘర్షణ వాతావరణం నెలకొంది. పోడు భూములలో గిరిజన రైతుల పంటలను బుల్డోజర్లతో ధ్వంసం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అటవీశాఖ అధికారులను అడ్డుకున్న ఆరుగురిని అధికారులు అదుపులోకి తీసుకుని రేగళ్ల రేంజ్ కార్యాలయానికి తరలించారు. ఏజెన్సీలో పోడు పోరు నిత్యకృత్యంగా మారింది. ప్రభుత్వం స్పందించి పోడు భూముల వద్దకు అటవీశాఖ అధికారులు రాకుండా చూడాలని గిరిజనులు కోరుతున్నారు.