మరో వ్యక్తితో భార్య సన్నిహిత సంబంధం
ABN , First Publish Date - 2022-10-25T23:38:04+05:30 IST
మండలంలోని రేమిడిచర్ల గ్రామంలో గల రైల్వే గేట్ దగ్గరలో తండ్రీ కొడుకులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం జరిగింది.
ఎర్రుపాలెం, అక్టోబరు 25: మండలంలోని రేమిడిచర్ల గ్రామంలో గల రైల్వే గేట్ దగ్గరలో తండ్రీ కొడుకులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం జరిగింది. ఖమ్మం రైల్వే జీఆర్పీ ఎస్ఐ పి.భాస్కరరావు తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన తన్నీరు రామారావు(34) తన కుమారుడు తన్నీరు గోపీచంద్(7)తో కలిసి రేమిడిచర్ల రైల్వే గేటువద్ద అప్లైన్ ట్రాక్పై వెళ్లే ఆర్పీఆర్ గూడ్సురైలు కింద పడి అక్కడికక్కడే మృతిచెందారని తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. బంధువులు కథనం ప్రకారం మృతుడి భార్య అదే పట్టణానికి చెందిన తమ్మిశెట్టి నాగరాజుతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో విషయం తెలుసుకుని మనస్తాపంతో తన కొడుకుతో ఆత్మహత్యకు పాల్పడట్టు తెలుస్తోంది.