గోదాం నిర్మాణం పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-10-11T05:53:53+05:30 IST

గోదాం నిర్మాణ పనులను యుద్ధ ప్రాతి పదికన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని నాఫ్స్‌ కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు.

గోదాం నిర్మాణం పూర్తి చేయాలి
గోదాం నిర్మాణాన్ని పరిశీలిస్తున్న రవీందర్‌రావు

గంభీరావుపేట, అక్టోబరు 10 : గోదాం నిర్మాణ పనులను యుద్ధ ప్రాతి పదికన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని నాఫ్స్‌ కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు. గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్‌లో ప్రాథమిక వ్యవసాయ  సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గోదాం నిర్మాణ పనులను సోమవారం పరిశీలించారు. నాబార్డు ద్వారా 500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో రూ.38 లక్షల అంచనాతో గోదాం నిర్మిస్తున్నారు. అనంతరం రవీందర్‌రావు మాట్లాడుతూ గోదాం నిర్మాణ  పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.  గజసింగవరంలో సహకార బ్యాంక్‌ ఇచ్చిన రూ.20 లక్షల రుణంతో నిర్మించిన పౌల్ర్టీ ఫాంను ప్రారంభించారు. ఆయన వెంట లింగాపూర్‌ సర్పంచ్‌ మోతె రాజిరెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్‌ మురళి, టీఆర్‌ఎస్‌ గ్రామ  అధ్యక్షుడు మల్లయ్య, రెడ్డి సంఘం అధ్యక్షుడు రాంరెడ్డి, నాయకులు చంద్రమౌళి, బాల్‌రెడ్డి, నారాయణరెడ్డి, సంజీవ్‌రెడ్డి, రాజు ఉన్నారు.

Updated Date - 2022-10-11T05:53:53+05:30 IST