ఆర్టీసీ కార్గో ద్వారా ధాన్యం బస్తాల రవాణా
ABN , First Publish Date - 2022-05-24T05:36:28+05:30 IST
గంగాధర మండలం కొండయ్యపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి టీఎస్ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా ధాన్యం బస్తాలను మానకొండూర్ రైస్ మిల్లులకు సోమవారం తరలించారు.
భగత్నగర్, మే 23: గంగాధర మండలం కొండయ్యపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి టీఎస్ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా ధాన్యం బస్తాలను మానకొండూర్ రైస్ మిల్లులకు సోమవారం తరలించారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు ఐదు కార్గో బస్సులను ధాన్యం బస్తాల రవాణాకు కేటాయించారు. ఆర్టీసీ కరీంనగర్ జోన్ డిప్యూటి సీటీఎం చౌహాన్, కరీంనగర్ ఆర్ఎంఈ రాజు, జగిత్యాల, కోరుట్ల, వేములవాడ, హుజూరాబాద్, డీఎంఈలు ఆధ్వర్యంలో ధాన్యం రవాణా చేశారు.