పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు
ABN , First Publish Date - 2022-01-27T05:34:59+05:30 IST
టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు దక్కుతాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
-జీవీ నియామకాన్ని స్వాగతిస్తున్నాం
-మంత్రి గంగుల కమలాకర్
సుభాష్నగర్, జనవరి 26: టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు దక్కుతాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం నగరంలోని ప్రెస్భవన్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన జీవీ రామకృష్ణారావును టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమిం చడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు కేవలం టీఆర్ఎస్కే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు టీఆర్ఎస్పై నమ్మకం పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తున్నారని గంగుల తెలిపారు. ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు టీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నారని మంత్రి అన్నారు.
‘టీఆర్ఎస్ బలోపేతానికి కృషి’
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ 2001లో టీఆర్ఎస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరానని, అప్పటి నుంచే తన రాజకీయ జీవితం ప్రారంభమైందన్నారు. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా తనను నియమించి పెద్ద బాధ్యత అప్పగించారని పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, నాయకులు చల్లా హరిశంకర్, కార్పొరేటర్లు కోటగిరి భూమాగౌడ్, బోనాల శ్రీకాంత్, గందె మహెశ్, పొన్నం అనిల్, రవి నాయక్ పాల్గొన్నారు.