మంథనిలో జోరు వర్షం
ABN , First Publish Date - 2022-08-07T06:03:11+05:30 IST
మంథని ప్రాం తంలో శనివారం సాయంత్రం గంట పాటు జోరుగా వర్షం కురిసింది.
- ఇళ్లలోకి చేరిన డ్రైనేజీ నీరు
- రోడ్లపై ప్రవహించిన వరద నీరు
మంథని, ఆగస్టు 6: మంథని ప్రాం తంలో శనివారం సాయంత్రం గంట పాటు జోరుగా వర్షం కురిసింది. వా తావరణంలో మార్పులు చోటుచేసుకొ ని నల్లటి మేఘాలు కమ్ముకొని భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని సత్యసాయినగర్లోని పలు ఇండ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులుపడ్డారు. నీటిని బయటకు పంపడానికి నానాపాట్లు పడ్డారు. స త్యసాయినగర్, పద్మశాలివీధి, దొంతు లవాడ, గాంధీచౌక్ తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లపైన మోకాలు లోతు వరద నీరు కొద్దిసేపు ప్రవహించింది. బస్టాండ్ సైతం జలమయమైంది. గత నెల 12, 13 తేదీల్లో భారీ వర్షాల కారణంగా సంభించిన భారీ వరదలతో అన్ని విధాలుగా నష్టపోయిన జనం ఇంకా తేరుకోక ముందే ఒక గంటపాటు కురిసిన భారీ వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే కొద్దిగంటల పాటు ఇలానే జోరుగా వర్షం కురిస్తే ఎలాగని జనం ఆందోళన చెందుతున్నారు.