బీఆర్ఎస్పై హర్షం
ABN , First Publish Date - 2022-10-07T06:10:06+05:30 IST
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మార్చుతున్నట్లు బుధవారం చేసిన ప్రకటనపై జిల్లాలో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
- గులాబీ శ్రేణుల సంబరాలు
- సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
గణేశ్నగర్, ఆక్టోబరు 6: సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మార్చుతున్నట్లు బుధవారం చేసిన ప్రకటనపై జిల్లాలో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. నగరంలో పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున వేడుక చేశారు. నగర మేయర్ యాదగిరి సునీల్రావు ఆధ్వర్యంలో తెలంగాణచౌక్లో టీఆర్ఎస్ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మేయర్ యాదగిరి సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సంర్బంగా మేయర్ యాదగిరి సునీల్రావు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం లిఖితమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు దేశ ప్రజల ప్రగతి కోసం జాతీయ రాజకీల్లోకి అడుగుపెట్టడం దేశానికి శుభసుచకమన్నారు. నాడు రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన కేసీఆర్ నేడు ఉజ్వల భారత్ కోసం జాతీయ రాజకీల్లోకి అడుగు పెట్టారని అన్నారు.