ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ

ABN , First Publish Date - 2022-03-02T06:28:40+05:30 IST

పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి (సామాజిక ఆరోగ్య కేంద్రం)ని జిల్లా వైద్యాధికారి జువైరియా మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ
జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో రికార్డులు పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ జువైరియా

జమ్మికుంట రూరల్‌, మార్చి 1:  పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి (సామాజిక ఆరోగ్య కేంద్రం)ని జిల్లా వైద్యాధికారి జువైరియా మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రికార్డులు పరిశీలించారు. ప్రసవాల సంఖ్య ఎందుకు తగ్గుతోందని ప్రశ్నించారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ుండలంలోని బిజిగిరిషరీఫ్‌ దర్గాను సందర్సించారు. అక్కడ జరిగే పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సీహెచ్‌సీ సూపరిండెంట్‌ సుమన్‌, పీహెచ్‌సీ వైద్యాధికారి తులసిదాస్‌, డాక్టర్‌ ఫాతిమా, డిస్ట్రిక్‌ హెల్త్‌ ఎడ్యుకేటర్‌ పంజాల ప్రతాప్‌, సీహెచ్‌వో సాజిద్‌, శంకర్‌రెడ్డి, సీసీ వసంత్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-02T06:28:40+05:30 IST