ఎఫ్లియేట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల పనులకు శంకుస్థాపన

ABN , First Publish Date - 2022-12-30T23:43:16+05:30 IST

ఆర్‌జీ-1 పరిధిలోని జీడీకే ఓసీపీ5 నందు రూ.60లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన 10వేల గ్యాలన్ల సామర్థ్యం గల రెండు ఎఫ్లియేట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు శుక్రవారం ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ శంకుస్థాపన చేశారు.

ఎఫ్లియేట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల పనులకు శంకుస్థాపన
ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ పనులను ప్రారంభిస్తున్న జీఎం నారాయణ

గోదావరిఖని, డిసెంబరు 30: ఆర్‌జీ-1 పరిధిలోని జీడీకే ఓసీపీ5 నందు రూ.60లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన 10వేల గ్యాలన్ల సామర్థ్యం గల రెండు ఎఫ్లియేట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు శుక్రవారం ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓసీపీ5 బేస్‌వర్క్‌ షాప్‌, సీఎస్‌పీ నుంచి వచ్చే డీజిల్‌, ఆయిల్‌, గ్రీస్‌, బొగ్గుతో కలిసిన వ్యర్థ నీటిని శుద్ధి చేసి కాలువలకు పంపిం చనున్నామని చెప్పారు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సూచనలకు అనుగుణంగా ఈ నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గతంలో కూడా సింగరేణి కాలనీలు, గోదావరిఖని నుంచి వచ్చే మురుగు నీటిని శుద్ధి చేయడం కోసం సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు సింగరేణి సంస్థ పెద్దపీట వేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సీఎంఓఏఐ అధ్యక్షులు పొనగోటి శ్రీనివాస్‌, ఏరియా ఇంజనీర్‌ రాంమూర్తి, డీజీఎం(పర్సనల్‌) లక్ష్మీనారాయణ, డీజీఎం(సివిల్‌) నవీన్‌, పీఓ చంద్రశేఖర్‌, మేనేజర్లు అనీల్‌ గబాలే, గోవిందరావు, ఐఈడీ ఆంజనేయులు, అభిలాష్‌, ప్రభాకర్‌, బాల సుబ్రహ్మణ్యం, ఆంజనేయ ప్రసాద్‌, యుగంధర్‌రెడ్డి, వసంతకుమార్‌, సదయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T23:43:18+05:30 IST