క్రమశిక్షణతో కూడిన సేవలందించాలి

ABN , First Publish Date - 2022-05-28T05:27:28+05:30 IST

పోలీసులు పూర్తి క్రమశిక్షణతో కూడిన సేవలను ప్రజలకు అందించాలని రామగుండం అదనపు డీసీపీ, పెద్దపల్లి ఇన్‌చార్జి ఐపీఎస్‌ అధికారి అఖిల్‌మహాజన్‌ అన్నారు.

క్రమశిక్షణతో కూడిన సేవలందించాలి
పోలీస్‌ అధికారులు, సిబ్బందితో మాట్లాడుతున్న ఇన్‌చార్జి డీసీపీ

- ఇన్‌చార్జి డీసీపీ అఖిల్‌ మహాజన్‌

సుల్తానాబాద్‌, మే 27: పోలీసులు పూర్తి క్రమశిక్షణతో కూడిన సేవలను ప్రజలకు అందించాలని రామగుండం అదనపు డీసీపీ, పెద్దపల్లి ఇన్‌చార్జి ఐపీఎస్‌ అధికారి అఖిల్‌మహాజన్‌ అన్నారు. ఆయన పెద్దపల్లి ఇంచార్జీ డీసీపీగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా మొదటిసారిగా సుల్తానాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించారు. సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐ ఉపేందర్‌, వినీత తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛం అందిం చి స్వాగతం పలికారు. అనంతరం డీసీపీ పోలీస్‌ సిబ్బందిని అధికారులను పరిచ యం చేసుకుని విధి నిర్వహణలకు సంబందించి పలు సలహాలు సూచనలు అం దించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌అధికారులు, సిబ్బంది జవా బుదారీతనంతో వ్యవహరించాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలు చేయాలన్నా రు. అదే సమయంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. స్టేషన్‌లోని పోలీసులు పట్టుకున్న పలు వాహనాలను ఆయ న పరిశీలించి, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

Updated Date - 2022-05-28T05:27:28+05:30 IST