మహిళా చైతన్యంతోనే సమాజాభివృద్ధి
ABN , First Publish Date - 2022-12-06T23:17:06+05:30 IST
మహిళా చైతన్యంతో నే సమాజ అభివృద్ధి జరుగుతుందని జడ్పీ చైర్మన్ పుట్టమధు అన్నారు.
ముత్తారం, డిసెంబరు 6: మహిళా చైతన్యంతో నే సమాజ అభివృద్ధి జరుగుతుందని జడ్పీ చైర్మన్ పుట్టమధు అన్నారు. మంగళవారం ముత్తారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో సావిత్రి బాయి ఫూలే జయంతిని పురస్కరించుకొని పుట్ట లింగమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన మహిళా చైతన్య సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎంతోమంది మహనీయుల త్యాగ ఫలితంగానే మనం మనగలుగుతున్నమన్నారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా విద్యా అవసరాలను గుర్తించిన తొలి మహిళగా సావిత్రి బాయి ఫూలే నిలుస్తారని పేర్కొన్నారు. ఎన్నో ఇబ్బందులు భరించి మహిళల్లో చైతన్యం తెచ్చార ని కొనియాడారు. అనంతరం జడ్పీ చైర్మన్ను ఆయా మండలాలకు చెందిన మహిళా అధ్యక్షులు ఘనంగా సత్క రించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జక్కుల ముత్తయ్య పటేల్, జడ్పీటీసీ చిలుకల స్వర్ణలత, టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు పప్పు స్వరూప, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.