సైదాపూర్‌లో పోరుబాట

ABN , First Publish Date - 2022-11-26T00:00:15+05:30 IST

సైదాపూర్‌ మండల కేంద్రంలో శక్రవారం కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యలో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రవీణ్‌రెడ్డి కార్యకర్తలతో కలిసీ ర్యాలీగా తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు వెళ్లి రైతు సమస్యలపై డిప్యూటీ తహసీల్దార్‌ మల్లేషంకు వినతీపత్రం అందజేశారు.

సైదాపూర్‌లో పోరుబాట
సైదాపూర్‌లో డిప్యూటీ తహసీల్దార్‌ వినతిపత్రం అందజేస్తున్న ప్రవీణ్‌రెడ్డి

సైదాపూర్‌, నవంబరు 25: సైదాపూర్‌ మండల కేంద్రంలో శక్రవారం కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యలో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రవీణ్‌రెడ్డి కార్యకర్తలతో కలిసీ ర్యాలీగా తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు వెళ్లి రైతు సమస్యలపై డిప్యూటీ తహసీల్దార్‌ మల్లేషంకు వినతీపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఽతెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణీ పోర్టల్‌తో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే ధరణీ పోర్టల్‌ను రద్దు చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులుకు ఎన్నికలల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ పోరుబాట కార్యక్రమం నిర్వహించామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాఘవులు, చాడ కొండాల్‌రెడ్డి, పోగు రమేష్‌, మ్యాకల రవిందర్‌, గోనెల స్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-26T00:00:29+05:30 IST