HYD : నేడు ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం
ABN , First Publish Date - 2022-06-03T14:43:52+05:30 IST
మహానగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ (Drinking Water)..
హైదరాబాద్ సిటీ : మహానగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ (Drinking Water) సప్లై ప్రాజెక్టు (కేడీడ బ్ల్యూఎస్పీ) ఫేజ్-2 రింగ్ మెయిన్-2కి సంబంధించి సాహెబ్నగర్ నుంచి మారేడ్పల్లి వరకు ఉన్న పైపులైన్ లాలాపేట ఆఫ్టేక్ వాల్వ్ల మరమ్మతు పనులను జలమండలి చేపడుతోంది. తార్నాకలోని రైల్వే క్వార్టర్స్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 గంటల వరకు పనులు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో ఫేజ్-2 కింద ఉన్న రిజర్వాయర్ల పరిధిలోగల బాలాపూర్, మైసారం, బార్కాస్, మేకలమండి, భోలక్పూర్, తార్నాక, లాలాపేట, బౌద్ధనగర్, మారేడ్పల్లి, రైల్వే కంట్రోల్రూమ్, ఎంఈఎస్, కంటోన్మెంట్, ప్రకా్షనగర్, పాటిగడ్డ, హస్మత్పేట్, ఫిరోజ్గూడ, గౌతంనగర్, వైశాలినగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, మారుతీనగర్, మహీంద్రాహిల్స్, వెలుగు గుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిలుకానగర్, బీరప్పగడ్డ, మీర్పేట్, లెనిన్నగర్, బడంగ్పేట్ ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని జలమండలి అధికారులు తెలిపారు.