HYD : దిగివస్తున్న కూరగాయల ధరలు..
ABN , First Publish Date - 2022-03-02T12:19:42+05:30 IST
కూరగాయల ధరలు దిగివస్తున్నాయి...
- అత్యధికం కిలో రూ.30 లోపే..
హైదరాబాద్ సిటీ : కూరగాయల ధరలు దిగివస్తున్నాయి. నగర శివారు ప్రాంతాల నుంచి కూరగాయల దిగుబడి అధికమైంది. దీంతో ధరలు సామా న్య ప్రజానీకానికి సైతం అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రైతు బజార్, వారాంతపు సంతలలో కిలో టమాట రూ.10లకే లభిస్తోం ది. పచ్చి మిర్చి మినహా ఇతర కూరగాయలు సైతం కిలో రూ.30లోపే రైతుబజార్లలో దొరుకుతున్నాయి. వంకాయ రూ.18, బెండకాయ 28, బీరకాయ 18, దొండకాయ 23, ఆలుగడ్డ 23, దోసకాయ 11, సోరకాయ రూ.15లకే రైతుబజార్లలో దొరుకుతున్నాయి. అయితే రిటైల్ కూరగాయల మార్కెట్లో మాత్రం రెండింతల ధరకు విక్రయిస్తున్నారు.