రెండు ముఠాలు Arrest : డీసీపీ గజరావ్ భూపాల్
ABN , First Publish Date - 2022-06-27T22:39:48+05:30 IST
Hyderabad: ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడుతున్న రెండు ముఠాలను సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఆ వివరాలను సీసీఎస్ డీసీపీ గజరావు

Hyderabad: ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడుతున్న రెండు ముఠాలను సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఆ వివరాలను సీసీఎస్ డీసీపీ గజరావు వెల్లడించారు. ‘‘ రెండు ముఠాలు ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నాయి. నౌకరి. కామ్, షైన్ డాట్ కామ్లలో నిరుద్యోగులు లోడ్ చేసిన ప్రొఫైల్స్ ఆధారంగా వారికి ఫోన్ చేస్తారు. సెల్ కంపెనీలో సీనియర్ జనరల్ మేనేజర్ జాబ్ ఇప్పిస్తామంటూ ఒక ముఠా యువతిని మోసం చేసింది. మరో ముఠా యసెంచుర్ కంపెనీలో అకౌంటెంట్ ఉద్యోగం ఇప్పిస్తామని మరో యువతిని మోసగించింది. ఢిల్లీలోని రెండు కాల్ సెంటర్లపై రైడ్ చేసి నలుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నాం. గత ఆరు నెలలుగా కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్, ట్రైనింగ్ చార్జెస్, యూనిఫాం చార్జెస్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. జాబ్ ఇవ్వక ముందే డబ్బులు వసూలు చేయడం, బ్యాక్ డోర్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పే వాళ్ళు పట్ల అప్రమత్తంగా ఉండాలి’’ అని కోరారు.