రైతుబంధు సమితి చైర్మన్‌ పదవీకాలం రెండేళ్లు పెంపు

ABN , First Publish Date - 2022-12-07T04:00:09+05:30 IST

తెలంగాణ రైతుబంధు సమితి’ చైర్మన్‌, డైరెక్టర్‌గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పదవీకాలాన్ని ప్రభుత్వం రెండేళ్ల పాటు పొడిగించింది.

రైతుబంధు సమితి చైర్మన్‌ పదవీకాలం రెండేళ్లు పెంపు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణ రైతుబంధు సమితి’ చైర్మన్‌, డైరెక్టర్‌గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పదవీకాలాన్ని ప్రభుత్వం రెండేళ్ల పాటు పొడిగించింది. ఈమేరకు సీఎస్‌ సోమే్‌షకుమార్‌ మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. రైతుబంధు సమితి చైర్మన్‌గా మూడేళ్ల పాటు కొనసాగేలా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని 2019 డిసెంబరు 7న ప్రభుత్వం నియమించింది. ఆ గడువు ఈ నెల 6తో ముగియడంతో ఆయన పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగించింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మరో రూ.500 కోట్ల అప్పు తీసుకుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో సెక్యూరిటీ బాండ్లను తనఖా పెట్టి ఈ రుణాన్ని సేకరించింది.

Updated Date - 2022-12-07T04:00:10+05:30 IST