విద్యార్థుల సమస్యలపై పోరాటం

ABN , First Publish Date - 2022-07-18T05:50:50+05:30 IST

విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎన్‌ఎ్‌సయూఐ నిరంతరం పోరాటాలు చేస్తోందని ఆ యూనియన్‌ రాష్ట్ర కా ర్యదర్శి బోయిడి నాగేంద్రబాబు అన్నారు.

విద్యార్థుల సమస్యలపై పోరాటం
మాట్లాడుతున్న ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్రబాబు

 ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్రబాబు 

కూకట్‌పల్లి, జూలై 17 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎన్‌ఎ్‌సయూఐ నిరంతరం పోరాటాలు చేస్తోందని ఆ యూనియన్‌ రాష్ట్ర కా ర్యదర్శి బోయిడి నాగేంద్రబాబు అన్నారు. గాంధీభవన్‌లో  ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ బల్మూరి అధ్యక్షతన ఆదివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బోయిడి నాగేంద్రబాబు పాల్గొని మాట్లాడారు. ఎన్‌ఎ్‌సయూఐకి విద్యార్థులు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-18T05:50:50+05:30 IST