Hyderabad : వేధించిన ప్రిన్సిపాల్ ఎదుటే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని..

ABN , First Publish Date - 2022-08-19T19:55:55+05:30 IST

రామంతాపూర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీ (Private college)లో దారుణం జరిగింది.

Hyderabad : వేధించిన ప్రిన్సిపాల్ ఎదుటే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని..

హైదరాబాద్ (Hyderabad): రామంతాపూర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీ (Private college)లో దారుణం జరిగింది. ప్రిన్సిపాల్ గదిలో విద్యార్థి పెట్రోల్ (Petrol) పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి (Suicide Attempt) పాల్పడ్డాడు. మంటలతో కాలిపోతున్న విద్యార్థి  ప్రిన్సిపాల్‌ను పట్టుకున్నాడు. ఆయనతోపాటు అక్కడే ఉన్న మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. కాలేజీ యాజమాన్యం వెంటనే 108కు సమాచారం అందించింది. దీంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. రూ. 16వేలు డ్యూ ఉందని, ఫీజు కట్టమని ప్రిన్సిపాల్ వేధిస్తుండడంతో విద్యార్థి పెట్రోలు పోసుకుని నిప్పంటిచుకున్నట్లు సమాచారం. కాలేజీ యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం గాంధీలో ముగ్గురు చికిత్స పొందుతుండగా కాలేజ్‌లో ఒకరు చికిత్స పొందుతున్నారు. కాగా మెరుగైన చికిత్స కోసం వారిని యశోద ఆస్పత్రికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-08-19T19:55:55+05:30 IST