చంచల్గూడ జైలుకు ఆర్మీ అభ్యర్థుల తరలింపు
ABN , First Publish Date - 2022-07-06T15:51:08+05:30 IST
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న వారిలో పదిమందిని ఈ నెల 4న సికింద్రాబాద్
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న వారిలో పదిమందిని ఈ నెల 4న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం మంగళవారం పదిమంది ఆర్మీ అభ్యర్థులకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, చంచల్గూడ జైలుకు పోలీస్ ఎస్కార్టు మధ్య తరలించారు.