రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా రవీందర్‌సింగ్‌

ABN , First Publish Date - 2022-12-09T02:40:28+05:30 IST

హైదరాబాద్‌/కరీంనగర్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, కరీంనగర్‌ మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ

రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా రవీందర్‌సింగ్‌

హైదరాబాద్‌/కరీంనగర్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, కరీంనగర్‌ మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా, రవీందర్‌సింగ్‌ కుమార్తె వివాహం గురువారం కరీంనగర్‌లో జరిగింది. ఈ వివాహానికి సీఎం కేసీఆర్‌ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Updated Date - 2022-12-09T02:40:30+05:30 IST