గతంలో పోలిస్తే అత్యాచారాలు పెరిగిపోయాయి: వైఎస్ షర్మిల
ABN , First Publish Date - 2022-06-23T01:36:54+05:30 IST
సూర్యాపేట: మాట ముచ్చట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నడిగూడెం మండలం వల్లాపురం గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ
సూర్యాపేట: మాట ముచ్చట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నడిగూడెం మండలం వల్లాపురం గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కౌలు రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. వారు బ్యాంకుల దగ్గర డీ ఫాల్టర్లుగా మిగిలిపోయారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు గతంలో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వాహనాల్లో టీఆర్ఎస్ నేతల బిడ్డలే అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.