Crime News: నా కుమారుడిని ఆర్థికంగా వాడుకున్నారు: నవీన్ రెడ్డి తల్లి

ABN , First Publish Date - 2022-12-10T14:11:11+05:30 IST

హైదరాబాద్: వైశాలి విషయంలో నవీన్ రెడ్డిది తప్పేనని ఆయన తల్లి నారాయణమ్మ ఒప్పుకున్నారు. అయితే తన కొడుకు క్షణికావేశంలో చేసి ఉంటాడని అన్నారు.

Crime News: నా కుమారుడిని ఆర్థికంగా వాడుకున్నారు: నవీన్ రెడ్డి తల్లి

హైదరాబాద్: వైశాలి విషయంలో నవీన్ రెడ్డిది తప్పేనని ఆయన తల్లి నారాయణమ్మ ఒప్పుకున్నారు. అయితే తన కొడుకు క్షణికావేశంలో చేసి ఉంటాడని అన్నారు. తన కుమారుడిని వైశాలి కుటుంబం అన్ని విధాలుగా వాడుకుందని చాలా డబ్బులు ఖర్చుపెట్టించారని నారాయణమ్మ ఆరోపించారు. నవీన్ రెడ్డి, వైశాలి భార్య భర్తల్లా తిరిగారని, పెళ్లి కూడా చేసుకున్నట్లు తెలిసిందన్నారు. అయితే ఎన్ఆర్ఐ సంబంధం కోసం వైశాలి కుటుంబం తన కుమారుడిని మోసగించారని చెప్పారు. కాగా

నారాయణమ్మ మీడియాతో మాట్లాడుతు ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఆమెను హుటాహుటిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆమెకు పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కుమారుడు నవీన్ రెడ్డి గురించి మాట్లాడుతున్న సమయంలో బీపిలో హెచ్చుతగ్గులు రావడంతో వణుకుతూ సొమ్మసిల్లి పడిపోయారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో స్థానికులు సపర్యలు చేసిన అనంతరం ఆస్పత్రికి తీసుకు వెళ్ళారు.

Updated Date - 2022-12-10T14:11:16+05:30 IST