TRS Sabha: భారీ ర్యాలీతో మునుగోడు బయలుదేరిన మంత్రి తలసాని, దానం, మేయర్
ABN , First Publish Date - 2022-08-20T16:15:50+05:30 IST
మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభకు మంత్రులు, నేతలు తరలివెళ్తున్నారు.
హైదరాబాద్: మునుగోడులో టీఆర్ఎస్ (TRS) ప్రజా దీవెన సభకు మంత్రులు, నేతలు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో నగరంలోని నెక్లెస్ రోడ్ నుండి భారీ ర్యాలీతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani srinivas yadav), ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam nagender), మేయర్ గద్వాల విజయ లక్ష్మీ(Gadwala vijayalaxmi) మునుగోడుకు బయలుదేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.... ప్రజా దీవెన సభకు సిటీ నుండి 1300 కార్లలో ర్యాలీ స్టార్ట్ అవుతుందన్నారు. అన్ని ప్రాంతాలనుండి ఉప్పల్ బగాయత్ చేరుకొని.. సీఎం కాన్వాయ్ వెంట మునుగోడుకు స్టార్ట్ అవుతామని చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చేతకాని తనం వల్లే ఉప ఎన్నిక వచ్చిందని విమర్శించారు. ఏది ఏమైనా ప్రజలు కోరుకునేది గులాబీ జెండానే అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.