భక్తులతో కిక్కిరిసిన లాల్దర్వాజ మహంకాళి ఆలయం
ABN , First Publish Date - 2022-07-25T22:33:54+05:30 IST
Hyderabad: లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. బోనాల పండుగ నేపథ్యంలో అమ్మవారి రంగం కార్యక్రమానికి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. దీంతో అమ్మవారి ఆలయ పరిసరాలు పల్లె వాతావరణాన్ని
Hyderabad: లాల్దర్వాజ (Lal Darwaja) సింహవాహిని మహంకాళి ఆలయం (Mahankali Temple) భక్తులతో కిటకిటలాడింది. బోనాల పండుగ నేపథ్యంలో అమ్మవారి రంగం కార్యక్రమానికి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. దీంతో అమ్మవారి ఆలయ పరిసరాలు పల్లె వాతావరణాన్ని తలపించాయి. పోతరాజు అశ్విన్ యాదవ్ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. మాతంగి అనూరాధ పచ్చికుండపై నిల్చుని రంగం వినిపించనుంది.
ఆషాడం బోనాలు రెండు రోజులు పాటు జరుగుతాయి. జూలై 24న బోనాల సందడిలో భాగంగా లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. తెల్లవారు జామునుంచే అమ్మవారికి బోనాలు సమర్పించడానికి భారీ సంఖ్యలో భక్తులు పోటీపడ్డారు. బోనాల ఉత్సవాల చివరి రోజు జూలై 25వ తేదీ రంగం, ఘటం ఊరేగింపు నిర్వహిస్తారు.