Chiranjeevi: ఓ అన్నయ్యను కోల్పోయాను..

ABN , First Publish Date - 2022-12-23T14:25:19+05:30 IST

హైదరాబాద్: విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) మృతికి చిరంజీవి, పవన్, త్రివిక్రమ్‌ నివాళులర్పించారు.

Chiranjeevi: ఓ అన్నయ్యను కోల్పోయాను..

హైదరాబాద్: విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) మృతికి చిరంజీవి, పవన్, త్రివిక్రమ్‌ నివాళులర్పించారు. కైకాల భౌతికకాయాన్ని చూసి కంట తడిపెట్టిన చిరంజీవి సత్యనారాయణ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్బంగా చిరు మాట్లాడుతూ కైకాల మృతితో ఓ అన్నయ్యను కోల్పోయానన్నారు. ఆయనతో నటించిన ప్రతి సినిమా ఒక తీపి జ్ఞాపకమన్నారు. కల్మషం లేని స్వచ్ఛమైన మనసున్న మనిషని కొనియాడారు. ఆయన దూరం కావడం మన దురదృష్టమన్నారు. కైకాల మృతి చిత్రపరిశ్రమకు తీరనిలోటని, ఒక తరం ముగిసిందని అన్నారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు చిరంజీవి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా సత్యనారాయణ (87) శుక్రవారం తెల్లవారుజామున ఆయన స్వగృహం

లో గుండెపోటుతో మరణించారు.

Updated Date - 2022-12-23T14:25:23+05:30 IST