BJP జాతీయ కార్యవర్గ సమావేశంలో Telanganaపై చర్చ.. Etalaకు అరుదైన గౌరవం..
ABN , First Publish Date - 2022-07-03T20:57:37+05:30 IST
రెండో రోజు ఆదివారం బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గ సమావేశాలు హెచ్ఐసీసీ (HICC) వేదికగా ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్ (Hyderabad): రెండో రోజు ఆదివారం బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గ సమావేశాలు హెచ్ఐసీసీ (HICC) వేదికగా ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో తెలంగాణ (Telangana)పై చర్చ జరిగింది. లంచ్ బ్రేక్ ముందు చర్చకు కార్యవర్గం అనుమతించింది. కార్యవర్గ చర్చలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajendar)కు అరుదైన గౌరవం లభించింది. తెలంగాణ నుంచి మాట్లాడే అవకాశం కలిగింది. తెలంగాణలో పార్టీ బలోపేతం, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై ఈటల మాట్లాడారు. ఈటల చాలా బాగా మాట్లాడారని ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. తర్వాత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy) మాట్లాడారు. లంచ్ బ్రేక్ తర్వాత డీకే అరుణ మాట్లాడారు. కాగా తెలంగాణపై ప్రవేశపెట్టిన ప్రత్యేక పత్రాన్ని కిషన్ రెడ్డి మరి కాసేపట్లో మీడియాకు వివరించనున్నారు.
మొదటి రోజు (శనివారం) సమావేశాలకు హాజరైన ప్రధాని మోదీ (Modi) రాత్రి నోవాటెల్ (Novotel) హోటల్లో బస చేశారు. తెలంగాణలో పాగావేయాలనే ప్రయత్నాలు.. దక్షిణాదిన విస్తరించాలనే వ్యూహంలో భాగంగా జాతీయ కార్యవర్గ సమావేశాలను బీజేపీ హైదరాబాద్లో నిర్వహిస్తోంది.
ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య నాయకులు, 350 మంది ప్రతినిధులు హైదరాబాద్కు తరలివచ్చారు. నిన్న శనివారం తొలిరోజు సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ రోజు కార్యవర్గ సమావేశంలో మోదీ, అమిత్ షాలు ప్రసంగించనున్నారు. పార్టీ బలోపేతానికి ఉద్దేశించిన అంశాలను ఈ సమావేశంలో చర్చిస్తామని హైదరాబాద్ వచ్చిన వెంటనే ప్రధాని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కార్యవర్గం సమావేశం ముగిసిన అనంతరం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ విజయ సంకల్ప సభ జరగనుంది. లక్షలాది మంది పాల్గొనే ఈ భారీ బహిరంగసభలో ప్రదాని మోదీ పాల్గొని కీలక ఉపన్యాసం చేయనున్నారు.