TS News: మహిళ మెడలో బంగారు గొలుసును లాక్కెళ్లిన దుండగుడు
ABN , First Publish Date - 2022-10-11T14:59:02+05:30 IST
నగరంలోని నార్సింగి పోలీస్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ జరిగింది.
హైదరాబాద్: నగరంలోని నార్సింగి పోలీస్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ జరిగింది. తిరుమల హిల్స్ కాలనీకి చెందిన అరుణ అనే మహిళ మెడలోంచి మూడున్నర తులాల బంగారు పుస్తెల తాడును దుండగుడు లాక్కెళ్లాడు. సదరు మహిళ బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగి వస్తుండగా... స్కూటీపై వచ్చిన దుండగుడు మహిళ మెడలో ఉన్న పుస్తెల తాడును అపహరించాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.