తెలంగాణలో 4 రెట్లు కేసులు పెరుగుతున్నాయి: డీహెచ్‌ శ్రీనివాసరావు

ABN , First Publish Date - 2022-01-06T21:03:12+05:30 IST

దేశంలో థర్డ్‌వేవ్‌ ప్రారంభమైందని కేంద్రం చెప్పిందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డీహెచ్‌ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

తెలంగాణలో 4 రెట్లు కేసులు పెరుగుతున్నాయి: డీహెచ్‌ శ్రీనివాసరావు

హైదరాబాద్: దేశంలో థర్డ్‌వేవ్‌ ప్రారంభమైందని కేంద్రం చెప్పిందని, వచ్చే నాలుగు వారాలు అత్యంత కీలకమని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డీహెచ్‌ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్బంగా గురువారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో 4 రెట్లు కేసులు పెరుగుతున్నాయన్నారు. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో పాజిటివిటీ రేటు పెరిగిందని, అయితే 90 శాతం కేసుల్లో లక్షణాలు లేవన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, సొంత వైద్యం చేసుకోవద్దను సూచించారు. కరోనా లక్షణాలున్నవారు వైద్యులను సంప్రదించాలన్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ పరిధిలోని సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు డీహెచ్‌ శ్రీనివాసరావు వెల్లడించారు.

Updated Date - 2022-01-06T21:03:12+05:30 IST