ప్రయాణంలోనే ప్రాణం పోయింది

ABN , First Publish Date - 2022-12-07T00:42:45+05:30 IST

ప్రయాణంలోనే ఓ వ్యక్తి ప్రాణం పోయింది. బస్సులో ప్రయాణిస్తుండగా గుండెపోటుతో మృతిచెందాడు.

ప్రయాణంలోనే ప్రాణం పోయింది

కూకట్‌పల్లి, డిసెంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): ప్రయాణంలోనే ఓ వ్యక్తి ప్రాణం పోయింది. బస్సులో ప్రయాణిస్తుండగా గుండెపోటుతో మృతిచెందాడు. జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్పు మంగళవారం ఉదయం 7 గంటలకు జీడిమెట్ల బస్టాప్‌ నుంచి చార్మినార్‌ బయలుదేరింది. జీడిమెట్లకు చెందిన నాగరాజు(30) బస్సు ఎక్కి అఫ్జల్‌గంజ్‌ వరకు టికెట్‌ తీసుకొని సీట్లో కూర్చున్నాడు. బస్సు ప్రశాంతినగర్‌ బస్టాప్‌ సమీపంలోకి రాగానే నాగరాజు దుస్తుల్లోనే యూరిన్‌ పోసి పడుకొని ఉండడం ప్రయాణికులు గమనించారు. డ్రైవర్‌, కండక్టర్‌ అతడిని పరిశీలించగా స్పహలో లేడు. వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌ సిబ్బంది పరిశీలించి మృతి చెందాడని నిర్ధారించారు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో మృతి చెందినట్లు భావిస్తున్నారు.

Updated Date - 2022-12-07T00:42:46+05:30 IST