TS News: కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్కు హరీష్రావు సవాల్
ABN , First Publish Date - 2022-09-02T22:15:25+05:30 IST
హైదరాబాద్ (Hyderabad): బీజేపీపై మంత్రి హరీష్రావు (Harish Rao) మండిపడ్డారు.
హైదరాబాద్ (Hyderabad): బీజేపీపై మంత్రి హరీష్రావు (Harish Rao) మండిపడ్డారు. కేంద్ర మంత్రులు అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat)లో 2021లోనే తెలంగాణ (Telangana) చేరిందన్నారు. ఆయుష్మాన్ భారత్ విషయంలో అబద్దాలు చెప్పిన నిర్మలా సీతారామన్ (Nirmala Seetharaman) క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న నిర్మలా సీతారామన్ అవాస్తవాలు మాట్లాడారని అన్నారు. ప్రజలకు వాస్తవాలు అర్ధమవుతాయని ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ చేరలేదని అన్నారని... ఈ సందర్భంగా హరీష్రావు కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్కు సవాల్ చేశారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్లో చేరకపోతే నేను ఇప్పుడే రాజీనామా చేస్తా.. చేరితే మీరు చేస్తారా? ఫ్లీజ్ క్షమాపణ చెప్పాలి మీరు’’ అని మంత్రి డిమాండ్ చేశారు.
ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ చేరిందా? లేదా? అని 4-2-2022లో పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్న వేయగా.. దీనికి సమాధానంగా 18-5-2021లో తెలంగాణ ఆయుష్మాన్ భారత్లో చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సమాధానం చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి హరీష్ గుర్తు చేశారు.