ఎస్పీ శైలజకు ఘంటసాల పురస్కారం

ABN , First Publish Date - 2022-12-10T00:40:12+05:30 IST

జానపద పాటలు అలవోకగా పాడగల ఎస్పీ శైలజ శాస్త్రీయ గీతాలను స్వరబంధురంగా ఆలపించే మధురగాన విదుషీమణి అని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నత న్యాయస్థానం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ రామలింగేశ్వరరావు ప్రశంసించారు.

ఎస్పీ శైలజకు ఘంటసాల పురస్కారం
ఎస్పీ శైలజకు పురస్కారం ప్రదానం చేస్తున్న జస్టిస్‌ రామలింగేశ్వరరావు, రుద్రరాజు పద్మరాజు

చిక్కడపల్లి, డిసెంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): జానపద పాటలు అలవోకగా పాడగల ఎస్పీ శైలజ శాస్త్రీయ గీతాలను స్వరబంధురంగా ఆలపించే మధురగాన విదుషీమణి అని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నత న్యాయస్థానం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ రామలింగేశ్వరరావు ప్రశంసించారు. త్యాగరాయగానసభ ప్రధాన వేదికపై రాగరాగిణి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ప్రఖ్యాత గాయకుడు ఘంటసాల శతజయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ నేపఽథ్యగాయని ఎస్పీ శైలజకు ఘంటసాల పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన జస్టి్‌స రామలింగేశ్వరరావు పురస్కారం బహూకరించి మాట్లాడారు. ఘంటసాల తెలుగువారికి లభించిన గొప్ప వరమన్నారు. ఆయన పాడిన ప్రతి పాట ఆణిముత్యమని అన్నారు. అధ్యక్షత వహించిన శాసనమండలి మాజీ సభ్యులు రుద్రరాజు పద్మరాజు మాట్లాడుతూ పాట ఉన్నంత కాలం ఘంటసాల జీవించి ఉంటారని అన్నారు. బోయి భీమన్న నిధి చైౖర్మన్‌ హైమవతి భీమన్న.... శైలజ, ఆమె భర్త సుధాకర్‌ను అభినందించారు. సుబ్బలక్ష్మి నివేదిక సమర్పించగా, ఆనంద్‌ వ్యాఖ్యానంలో రమణకుమారి బృందం మధురంగా పాటలను ఆలపించారు. నాట్యగురువు పద్మజారెడ్డి, సినీ జర్నలిస్ట్‌ సంజయ్‌, సౌజన్యదాతలు ఆంజనేయులు, రామమూర్తినాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:40:14+05:30 IST