క్షేమంగా ఇంటికొచ్చిన గాయత్రి, మౌనిక

ABN , First Publish Date - 2022-03-06T15:32:13+05:30 IST

క్షేమంగా ఇంటికొచ్చిన గాయత్రి, మౌనిక

క్షేమంగా ఇంటికొచ్చిన గాయత్రి, మౌనిక

హైదరాబాద్ సిటీ : జీడిమెట్ల పరిధిలోని సురారంకాలనీకి చెందిన 10వ తరగతి విద్యార్థినులు మౌనిక, గాయత్రి శనివారం స్కూల్‌కు వెళ్లి తిరిగి ఇంటికిరాలేదు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే.. ఇవాళ ఉదయం మౌనిక, గాయత్రి ఇద్దరూ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. దీంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే శనివారం సాయంత్రం ఈ ఇద్దరు ఎక్కడికెళ్లారన్న విషయం మాత్రం తెలియరాలేదు. కాగా.. శనివారం నాడు సూరారం చెరువు కట్ట వద్ద బాలికల స్కూల్‌ బ్యాగులు లభించాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేశారు. బాలికలు బ్యాగులు అక్కడ పడేసి ఎక్కడికైనా వెళ్లారా..? లేక మరేదైనా జరిగి ఉంటుందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. ఆదివారం ఉదయానికి విద్యార్థినులు ఇంటికి చేరుకున్నారు.

Updated Date - 2022-03-06T15:32:13+05:30 IST